అశోకవనంలో టాలీవుడ్ యంగ్ హీరో `క‌ళ్యాణం`!

`ఈ నగరానికి ఏమైంది` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్.. `ఫ‌ల‌క్ నామా దాస్` సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఆక‌ట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న `పాగల్` అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే డిఫ‌రెంట్ టైటిల్‌తో మ‌రో సినిమాను స్టార్ట్ చేశాడు.

అదే `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్‌ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తల్లి దుర్గ క్లాప్‌ ఇచ్చారు. ఇప్పటివరకూ విశ్వక్ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో ఈ చిత్రం ఉంటుంద‌ని.. ప్రేమ, వినోదం అన్నీ ఇందులో ఉంటాయ‌ని అంటున్నారు.

Image