‘నాయకుడు’ ఇండియాలో రూపొందిన అనేక గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ టైమ్లెస్ గ్యాంగ్స్టర్ సినిమాను డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో కమల్ మూడు వీరయ్య నాయుడుతో పాటు విభిన్న వయస్సుల వ్యక్తులలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం దశాబ్దాల తర్వాత కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దురదృష్టవశాత్తు, 1987లో విడుదలైన ఈ క్లాసిక్ని పెద్ద స్క్రీన్పై చూసే అవకాశం ఇప్పటి తరం యువకులు, మధ్య వయస్కులకు రాలేదు. వారు యూట్యూబ్ లేదా టీవీ ఛానెల్లలో మాత్రమే చూడటం సాధ్యమవుతోంది, ఇవి థియేటర్లో మూవీ చూసినంత అనుభూతిని కలిగించవు.
అయితే ఈ సినిమా అభిమానులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అదేంటంటే, ‘నాయకుడు’ సినిమాని నవంబర్ 3న మెరుగైన ఫీచర్లతో మళ్లీ విడుదల చేయనున్నారు. మూవీ ప్రింట్ను 4K రిజల్యూషన్కి అప్గ్రేడ్ చేశారు, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో సౌండ్ మెరుగుపరిచారు. మెరుగైన కాంట్రాస్ట్ కోసం రంగు కూడా అడ్జస్ట్ చేశారు. తమిళనాడులో 120 థియేటర్లతో డీల్ కుదుర్చుకున్న ఈ సినిమా కేరళలో కూడా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని కన్నడలో కూడా డబ్బింగ్ చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని విడుదల చేయడం లేదు. సినిమాని అసలు తెలుగులో విడుదల చేసే ఆలోచనలు లేకపోవడమే ఇప్పుడు చాలామందికి కోపం తెప్పిస్తోంది.
ఈ చిత్రం మొదట విడుదలైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని సాధించింది. ఇది చాలా కేంద్రాలలో 100 రోజులకు పైగా నడిచింది. హోమ్ వీడియో విక్రయాలలో రికార్డులను బద్దలు కొట్టింది. అంత మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిసినా, ఇతర సౌత్ లాంగ్వేజెస్కి ఈ మూవీ వస్తున్నా, తమ భాషలో రావడం లేదని తెలుగు సినీ ప్రేమికులు తిట్టిపోస్తున్నారు. ‘నాయకుడు’ వంటి క్లాసిక్స్ని కొత్త తరానికి థియేటర్లలో పరిచయం చేయాలని, తద్వారా సినిమా మేకింగ్లోని నిజమైన కళను చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. కమల్ హాసన్ కు ఆల్రెడీ సినిమా రిలీజ్ గురించి తెలిసే ఉంటుంది. అతను తెలుగులో ఎందుకు విడుదల చేయడం లేదని అడిగాడా, లేదంటే తెలుగును చులకనగా భావించాడా అనేది కూడా తెలియ రాలేదు.