గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టి‌డి‌పి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది.

తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే వైసీపీ ఓ నాలుగైదు సీట్లలో గెలిచేది. పశ్చిమలో వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ కూడా పొత్తు ఉంటే వైసీపీ 2-3 సీట్లు గెలుచుకునేది. ఇక గత ఎన్నికల్లో ఎలాగో పొత్తు లేకపోవడం వల్ల అటు టి‌డి‌పి, ఇటు జనసేన దెబ్బతిన్నాయి. ఈ సారి పొత్తు దిశగా వెళుతున్నాయి..దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీకి భారీ దెబ్బ తప్పదు.

అలాగే అక్కడ ఉన్న మంత్రులు సైతం ఓటమి బాటపట్టక తప్పదు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఛాన్స్ కొట్టేసి..చంద్రబాబు, పవన్ లపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన కలిస్తే మొదట డేంజర్ జోన్ లోకి వెళ్ళేది ఆ మంత్రులే. కానీ ఒక్క మంత్రి మాత్రం సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్మడి తూర్పులో ముగ్గురు మంత్రులు ఉన్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా..వీరిలో రాజా తప్ప మిగతా ఇద్దరు పొత్తు దెబ్బలో ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది.

రాజా ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో జనసేన ప్రభావం తక్కువ..టి‌డి‌పి కూడా బలంగా లేదు. దీని వల్ల రాజా సేఫ్. అటు పశ్చిమలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత..ఈ ముగ్గురు టి‌డి‌పి-జనసేన పొత్తుతో ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు.