ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పొలిటికల్ హీట్ ప్రతిరోజు ఉత్కంఠ భరితంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఒక యుద్ధమే జరుగుతోందని చెప్పవచ్చు. పరస్పరం ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న సమయంలోనే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ సత్తా చాటుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ది అవతార్ సినిమా గ్రాండ్ గా ఈ నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక పాటలు మాత్రం పెద్దగా రెస్పాన్స్ రాలేదు.ముఖ్యంగా ప్రమోషన్ కంటెంట్తో మంచి అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్ పైన తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.. అప్పటినుంచి ఈ సినిమా కొనడానికి బయ్యర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.అందుకు కారణం ప్రభుత్వం ఈ సినిమా టికెట్లు రేట్లు మరియు స్పెషల్ షో కి అనుమతి ఇవ్వదనే భయంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో టికెట్లు రేట్లు చాలా తక్కువగా ఉండడంతో కలెక్షన్లు కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉండదని బయ్యర్లు తెలియజేస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా బిజినెస్ రూ .100 కోట్ల నుంచి రూ .10 కోట్ల రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే నష్టాలు వెలబడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.