జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ కూడా ఒకరు. తనదైన యాస డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో అటువైపుగా అడుగులు వేశారు. అలా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇప్పటికీ రంగస్థలం మహేష్ గా పేరు సంపాదించారు. అప్పటివరకు తన కామెడీతో నవ్వించిన మహేష్ ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో మహేష్ అభిమానానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తర్వాత మహానటి, శ్రీనివాస కళ్యాణం, 118 , బుర్రకథ, వరుడు కావలెను ,దాస్కాధంకి తదితర చిత్రాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించారు రంగస్థలం మహేష్. మహేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో హాజరై తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను కూడా తెలియజేయడం జరిగింది. మహేష్ మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జీరో కేవలం తన ప్రతిభను నమ్ముకుని వచ్చా నా చిన్నతనం నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టము ఎప్పటికైనా సినిమాలలో నటించాలని ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.
అయితే సినిమాలనే నమ్ముకున్న నేను సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడే తన తండ్రి మరణించారని ఆ సమయంలో తన తండ్రికి చితి పెట్టేందుకు కూడా డబ్బులు లేవని.. అప్పుడు చాలా బాధేసింది..ఎందుకు బతుకుతున్నాను రా అనిపించింది.. దీంతో చాలామంది బంధువులు స్నేహితులు నీకు సినిమాలు అవసరమా అంటూ తిట్టారట..ఆ సమయంలో నేను మాత్రం చాలా బాధపడ్డాను.. నాకు మొదట సినిమా అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్.. రంగస్థలంలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు అది ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.