నటి కస్తూరి పై ఓంకార్ షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్న ఓంకార్ కు సపరేటు స్టైల్ ఉందని చెప్పవచ్చు.. యాంకర్ విషయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సిక్స్త్ సెన్స్ సీజన్ -5 కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటిస్టెంట్లను సస్పెన్స్ తో చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు ఓంకార్.. హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారో తాజాగా రిలీజ్ అయిన సిక్స్త్ సెన్స్ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతోంది. నటి కస్తూరి తో పాటు నీపా హజరు కావడం జరిగింది.

వీరిద్దరితోపాటు జ్యోతి రెడ్డి, సుష్మకిరణ్ ఈ షోల పాల్గొనడం గమనర్హం .ఈ ప్రోమోలో తాజాగా ఓంకార్ మాట్లాడుతూ.. మీ నలుగురు మదర్స్ గా ఉన్నప్పటికీ మీరు ఇంత హాటుగా వస్తే నాకు చెమటలు పడుతున్నాయని ఓంకార్ తెలియజేస్తారు.. కస్తూరి, నీపా ఊ అంటావా మావ సాంగ్కు కూడా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు..ప్రోమోలో భావవి నువ్వు భామను నేను అనే పాటకు కస్తూరి తన డాన్స్తో అదరగొట్టేసిందని చెప్పవచ్చు.

కస్తూరి డాన్స్ చూసిన ఓంకార్ కస్తూరి గారు కింద ఏదో పడిపోయింది అని చెప్పగా ఏమిటి సార్ అని అడగగా.. ఆమె ఏం పడిపోయిందో అంటూ వెతుకుతూ ఉండగా ఓంకార్ మీ అందం పడిపోయిందని చెప్పారు..ఆ తర్వాత ఓంకార్ ఏనుగును మీకు బహుమతిగా ఇస్తే ఎక్కడ దాచుకుంటారు అని అడగగా మీ పెద్ద మనసులో దాచి పెట్టుకుంటాం సార్ అంటూ కామెంట్లు చేశారు.. దీంతో ఓంకార్ చివరిగా మీరు ఏ యాంగిల్ లో చూసిన అసలు మదర్ లా కనిపించడం లేదంటూ మరదలా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది.