ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఇంతకాలం అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ..టిడిపికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది..ఇంకా వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా సరే వైసీపీ కూడా అదే స్థాయిలో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో రెండు పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు.
వాస్తవానికి టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటు చేశారు. దీంతో టిడిపి ఒక సీటు గెలుచుకుంది. ఇక దాన్ని కవర్ చేయడానికి వైసీపీ..చంద్రబాబు ఎమ్మెల్యేలని కొన్నారని ప్రచారం మొదలుపెట్టింది. ఆఖరికి టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారి చేత కూడా తమకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని చెప్పించారు. అక్కడే వైసీపీ రాంగ్ స్టెప్ వేసింది. అలా జంప్ అయిన వారి చేత కూడా చెప్పించడం వల్ల వైసీపీని ఎవరు నమ్మలేదు.
ఇదే సమయంలో ఆ నలుగురే కాదు..ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా చంద్రబాబు అదే రకంగా చెప్పారు. ఇంకా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు. దీనికి కౌంటరుగా వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగి..తాము తలుచుకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు మినహా మిగిలిన టిడిపి ఎమ్మెల్యేలని వైసీపీలోకి రప్పించుకుంటామని అన్నారు.
అయితే అది జరిగే పని కాదని అర్ధమవుతుంది..కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ ఉంది..కాకపోతే ఎంతమందిని తీసుకుంటారనేది చర్చ.