టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తే.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రలను పోషించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు.
ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ప్రస్తావన రాగా.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. SSMB28లో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, అలాగే మహేష్ బాబు ఇంతకుముదెన్నడూ చూడని గెటప్ లో కనిపిస్తారని తెలిపింది. అలాగే మహేష్ అద్భుతమైన నటుడు మరియు గ్రేట్ కోస్టార్ అని కొనియాడింది. ప్రత్యేకించి మహేష్ బాబు వాయిస్ మాడ్యూలేషన్ అంటే తనకు పిచ్చి అని పేర్కొంది. వాయిస్ మాడ్యూలేషన్లో సూపర్ స్టార్ కంట్రోల్కు తాను ఫిదా అయినట్లు చెప్పింది. దీంతో బుట్టబొమ్మ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.