చిత్ర పరిశ్రమలో వరస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. నెలల వ్యధిలోనే అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మరణిస్తు చిత్ర పరిశ్రమకు తిరని దుఖః కలిగిస్తున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి (53) మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న చక్రవర్తి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
చక్రవర్తికి కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఆయన కుమారుడు జాని రేణిగుంట అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చక్రవర్తి 1997 రాశి అనే సినిమాతో నిర్మాతగా కోలీవుడ్ చిత్ర పరిశ్రకు పరిచయం అయ్యరు. అయన నిర్మాతగా కోలీవుడ్లో హీరో అజిత్తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలను తెరకెక్కించారు.
ఆయన కేరీర్లో ఎక్కువ సినిమాలను హీరో అజిత్తో చేశాడు. శింబు నటించిన కాలై, వాలు సినిమాలను కూడా నిర్మించాడు. చక్రవర్తి మరణంతో ఒకసారిగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు అగ్ర హీరోలు కూడా సంతాపం తెలియజేశారు.
Producer #NICArts #SSChakravarthy has passed away.. He was suffering from cancer for the last 8 months..
He produced lot of movies with Actor #AjithKumar
Condolences to friends and family..
May his soul RIP! pic.twitter.com/JqmuvZZCAF
— Ramesh Bala (@rameshlaus) April 29, 2023