తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో విడిపోవడం జరిగింది. ప్రభుదేవా జీవితంలో ఇది ఒక చేదు సంఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు ప్రభుదేవా కి మొదటి భార్యతో విడాకులు విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే కొన్ని కారణాలవల్ల సినిమాల పైన పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు ప్రభుదేవా.
ఆ తర్వాత అన్ని సమస్యలు పరిష్కరించుకొని 2020 హిమని సింగ్ను ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఈమెతో ఎప్పుడూ కూడా ప్రభుదేవా పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ కలిసి తిరుమలలో ప్రత్యక్షమవడం జరిగింది. ప్రభుదేవా తన భార్య హిమని సింగ్ను ను శ్రీనివాసుడు సన్నిధిలో అడుగులు వేస్తూ కనిపించారు.
తెలుపు దుస్తులలో ప్రభుదేవా ఉండగా నీలిరంగు దుస్తుల లో హిమని సింగ్ను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే ప్రభుదేవా గురించి హిమని సింగ్ను మాట్లాడిన వీడియో వైరల్ గా మారుతోంది .ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని తెలియజేసింది. వీరిద్దరు పెళ్లి గురించి సోదరుడు రాజు సుందర్ తెలియజేయడం జరిగింది ప్రభుదేవా చివరిగా సల్మాన్ ఖాన్ సరసన రాదే చిత్రాన్ని తెరకెక్కించారు.
View this post on Instagram