తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట నేను శైలజ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలలో కూడా నటిస్తోంది కీర్తి సురేష్.
తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు భారీగానే క్రేజ్ ఏర్పడింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో అందాలతో రెచ్చిపోతోంది .మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఈమె గ్లామర్ డోస్ మరింత పెంచేసింది అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని ఈమె అందాల ఆరబోతతో కుర్ర కారులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే నాని నటించిన దసరా సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా సినిమాల ద్వారా ఎంత సంపాదిస్తోందిఅంటూ పలువురు నెటిజెన్లు ఆరా తీయగా కీర్తి సురేష్ ఒక్కో చిత్రానికి రూ 4 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలా సినిమాలతో పాటు యార్లలో కూడా నటిస్తూ ఏడాదికి రూ .8 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందని టాక్ వినిపిస్తోంది. మరొకసారి మహేష్ బాబు కి జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.