నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అటు టిడిపి, ఇటు వైసీపీ నుంచి వారసులు రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ నేతల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వారసులు పోటీ చేయడానికి లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే మళ్ళీ తనతో పోటీ చేయాలని చెప్పారు. కానీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
ఇదే క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రానున్న ఎన్నికల్లో మోహిత్ చంద్రగిరి బరిలో నిలబడనున్నారు. గత రెండు ఎన్నికల నుంచి చంద్రగిరిలో చెవిరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన్ని ఓడించడం టిడిపికి సాధ్యమయ్యే పని కాదని మాత్రం అర్ధమవుతుంది. ఇలాంటి సమయంలో చెవిరెడ్డి తనయుడు బరిలో ఉండటం వల్ల టిడిపికి కాస్త అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్తితి.
అసలు ఇక్కడ టిడిపి గెలిచి 30 ఏళ్ళు అయిపోతుంది..ఎప్పుడో 1994లో చివరిగా గెలిచింది. మళ్ళీ అప్పటినుంచి గెలవలేదు. పైగా ఇది చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం అయినా సరే ఇక్కడ టిడిపి గెలుపు గగనమైంది. 30 ఏళ్ల నుంచి గెలవడం లేదు. ఇప్పటికీ అక్కడ టిడిపికి పట్టు దొరకడం లేదు. అయితే ఇప్పుడు చెవిరెడ్డి తప్పుకుని, తన తనయుడుని రంగంలోకి దింపుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
కాస్త గట్టిగా కష్టపడితే చెవిరెడ్డి తనయుడుని నిలువరించవచ్చు. అలా కాకుండా ఎప్పటిలాగానే పరిస్తితి ఉంటే..మళ్ళీ చంద్రగిరిలో టిడిపి గెలవడం కష్టం.