తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా అనుకోని విషాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఎవరు ఊహించిన విధంగా ఎప్పుడు ఏదో ఒక విషాదం జరుగుతూనే ఉంది. ఇక గత సంవత్సరం మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని విషాదంగా మిగిలింది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులైన సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి వారు చిత్ర పరిశ్రమకు తీరని దుఃఖం మిగిల్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో సీనియర్ నటుడు క్యాస్ట్యూమ్ కృష్ణ మరణించారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన క్యాస్ట్యూమ్ కృష్ణ.. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడుగా తెలుగు పరిచయమయ్యారు.
ఆ తర్వాత పెళ్లి పందిరి సినిమాతో నిర్మాతగా మారారు. ఇక ఆ తర్వాత పెళ్ళాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలుగా నటించారు. ఆయన మృతితో టాలివుడ్లో విషాదం నెలకొంది. అనేక మంది సీనియర్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన తర్వాత నటించడం ప్రారంభించారు.