ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరుపొందింది ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఈ సినిమా VFX కారణంగా కాస్త ఆలస్యం అవుతోంది .ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రభాస్కు బాహుబలి తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు.

Adipurush: 'जय मल्हार' फेम देवदत्त नागेचा हनुमान अवतारातील नवा लुक पाहून  भारावले चाहते; म्हणाले... – News18 लोकमत
గతంలో ఆది పురుష్ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు విడుదల చేయగా దీంతో ఎన్నో విమర్శలు ఎదుర్కోవడంతోపాటు పలు రకాలుగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీంతో ఈ సినిమా పైన నెలకొన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో చిత్రీకరించారు చిత్రబృందం.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బిజినెస్ గత కొంతకాలంగా జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఓవర్సీస్ లో ఎవరు విడుదల చేస్తారు అనే విషయంపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.

How the backlash to the Adipurush teaser throws open a whole line of  questions!-Entertainment News , Firstpost

ఆది పురుష్ ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ సంస్థ AA ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.దీన్ని భారీ ధరకే కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను ఆనందపరుస్తుందో చూడాలి మరి.