ఆ విషయంలో సమంత కీలక నిర్ణయం..వర్క్ అవుట్ అవుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది . ఈ క్రమంలోనే సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకుంటుంది. అంతే కాదు త్వరలోనే శివ నిర్వాణ డైరెక్షన్ లో జరగకబోయే ఖుషి సినిమా షూటింగ్ లోను పాల్గొనబోతుంది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేసాడు డైరెక్టర్ శివ నిర్వాణ.

కాగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న సిటాడల్ వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే సమంత పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . అయితే సినిమాలపై సమంత పర్సనల్ నెగెటివిటీ ప్రాబ్లమ్స్ పడకుండా ..ఉండాలంటే ఆమె సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండాలి.. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్పిస్తే ..మరి ఏ అప్డేట్స్ పోస్ట్ చేయకూడదు.. అలాంటి టైం లోనే మేకర్స్ పెట్టిన డబ్బులకు ప్రాఫిట్స్ వస్తాయి.

ఈ క్రమంలోనే మేకర్స్ బాధలను అర్థం చేసుకున్న సమంత ..కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యిందట . కేవలం ఫిల్మీ అప్డేట్స్ మాత్రమే ఇవ్వడానికి డిసైడ్ అయ్యిందట . ఇదే విషయాన్ని సమంత ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి మరి సమంత తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఏ మేర వర్కౌట్ అవుతుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)