తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడు అనే పేరు రాగానే వినపడే పేర్లు దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్.. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులుగా ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులకు ఎంత క్రేజ్ ఉందంటే వారి దగ్గర ఒక కథ ఉంది అని తెలిస్తే నిర్మాతలు అది ఎలా అని కూడా అడగకుండా వారికి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు టాలీవుడ్ లోనే మంచి క్రేజ్ ఉంది. 2020లో అల్లు అర్జున్తో అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మహేష్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూశారని టాక్ కూడా నడిచింది.
త్రివిక్రమ్ ముందుగా రైటర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి కొన్ని సినిమాలుకు కథలు, డైలాగులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్ లోనే స్టార్ దర్శకుడుగా ఎదిగారు. ఆయన కెరీర్ ఆరంభంలో స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథలు ఇచ్చారు. ఆ సినిమాలకు ఆయన రాసిన మాటలకు అప్పుడు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత నాగార్జున ఆయనతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.
ఆ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ కథ కూడా రాశాడు.. ఆ కథే మన్మధుడు సినిమా.. ఈ సినిమాలో డైలాగులు నాగార్జునకు చాలా బాగా నచ్చాయి. త్రివిక్రమ్ ని ఈ కథ అడిగితే ఆయన కోటి రూపాయలు డిమాండ్ చేశారట. ఆ సమయం వరకు ఏ నిర్మాత రైటర్కు రూ.50 లక్షల కు మించి ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా నాగార్జున షాక్ అయ్యాడు. కాని త్రివిక్రమ్ చేసిన తక్కువ సినిమాలకే మంచి ఇమేజ్ ఉండటంతో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఆ కథ చేసారు. అది సూపర్ హిట్ అయింది.