సినీ ప్రపంచంలో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. మరి కొంతమందిని చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయం వచ్చే సమయానికి ప్రయత్నిస్తూ వేచి చూసినవారు స్టార్స్ అవుతారు..
అలాంటి వారిలో సునైనా మొల్లా కూడా ఒకరు. ఈమె పుట్టింది మహారాష్ట్రలోని నాగపూర్ లో తండ్రి హరీష్ మొల్ల, తల్లి సంధ్య మొల్ల ఇమే బీకాం పూర్తి చేసి మోడల్ గా తన కెరీయర్ని మొదలుపెట్టింది. పలు వాణిజ్య ప్రకటనలో కనిపిస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేది అలా రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంతో పరిచయం కావాల్సి ఉన్నది.
కానీ అందులో తను చేసిన పాత్ర ఎడిటింగ్లో తీసేసినట్లు తెలుస్తోంది. కానీ ఈసారి చిన్న పాత్రలలో కాకుండ ఏకంగా హీరోయిన్ అవకాశమే దక్కించుకుంది .2005 కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంలో నటించి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక తమిళంలో కడలిల్ విసంతిన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.తమిళ బిగ్ బాస్ -4 కంటిస్టుగా హౌస్ లోకి వెళ్లడం జరిగింది అలా తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది సునైనా.
ఆ తర్వాత తమిళంలో పాటు తెలుగులో, మలయాళం ,కన్నడ వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో రాజా రాజా చోర చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత విశాల్ తో కలిసి లాఠీ, రెజీనా వంటి పెద్ద సినిమాలలో ఈమె నటించిన ప్రస్తుతం సోనీ లైవ్లో ట్రిమ్ అవుతున్న వండర్ ఉమెన్ మీట్ క్యూట్ ల వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తన బ్రేకప్ నుంచి తెలియజేస్తూ తాను ఇంకా ఆ విషయం నుంచి కోలుకోలేదు.. ఈ మధ్యనే పలు పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను వీటి వల్ల ఎంతో కొంత ఉపశమనం దొరుకుతొంది ఇప్పుడే వివాహం చేసుకోనని తెలియజేస్తోంది సునైనా మొల్లా.