పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సినిమాలో నటించే నటీనటులను బాగా గౌరవిస్తారు. వారిని గుర్తుపెట్టుకుని.. సందర్భం వచ్చినప్పుడు వారికీ మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు.. ఆయనతో సుదీర్ఘకాలం సాహిత్యం ఉన్న స్నేహితులకు అప్పుడప్పుడు మంచి సర్ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు.
రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఆదిత్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. ప్రభాస్ తో పని చేసిన చాలామంది ఆయన షూటింగ్ సమయంలో వ్యవహరించే తీరు ఆయన ఇంటి నుంచి తెచ్చే లంచ్, డిన్నర్ బాక్సుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తమన్నా కూడా అదే తరహాలో మాట్లాడి వారి జాబితాలో చేరింది.
తమన్నా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ తన ఇంటికి ఏ అతిథి వచ్చిన ఎలా చూసుకుంటారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన భోజనానికి ఆహ్వానిస్తే 30 రకాల వంటకాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.. ఆయన డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించడు.. అందుకేనేమో ప్రభాస్ ని చూస్తుంటే రాజు అనే వాడు ఇలాగే ఉంటాడేమో అనిపించే విధంగా ఆయన ఆతిథ్యం ఉంటుంది. ఆయన తన మంచితనంతో అతిధి మర్యాదలతో చంపేస్తాడు.
ఆయనకు ఇండియాలోనే ఎంత పెద్ద స్టార్డం ఉన్నా , ఎంతో సింపుల్ గా ఉంటూ అందరితో కలిసి పోతూ ఉంటాడు. నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ఉంటారు. అలాంటిది ప్రభాస్కు మాత్రమే సాధ్యమైంది. ఆయన సింప్లిసిటీ ప్రతి ఒక్కరికి నచ్చకుండా ఉండదు అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇలా మాట్లాడిన వారిలో అమితాబచ్చన్ మొదలుకొని దీపికా పదుకొనే ,శృతిహాసన్, శ్రద్ధ కపూర్, కుర్తి సనన్ ఇంకా ఎంతో మందిస్టార్స్ ఉన్నారు.
ఆయన ఆతిథ్యం పొందాలని కూడా చాలామంది ప్రభాస్ తో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారట. ప్రస్తుతం ఆయన అరడజనుకు పైగా సినిమాలో బిజీగా ఉన్నారు. రాబోయే రెండేళ్లలో ఆయన నుంచి ఐదు,ఆరు సినిమాల వరకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అన్ని సినిమాలు వందల కోట్లతో రూపొందుతున్నాయి. కేవలం మారుతితో చేస్తోన్న ఒక సినిమా మాత్రమే తక్కువ బడ్జెట్ తో రూపొందుతోంది.