BigBoss 7లో అన్నీ జంటలే పాల్గొనున్నాయి?

అప్పటివరకు తెలుగులో అలాంటి షో మునుపెన్నడూ రాలేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులోకి BigBossషో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ క్రమంలో కొంతమంది మేధావులకు మాత్రం ఈ షో నచ్చలేదు. ఈ షోని నిలిపి వేయాలంటూ వారు మీడియా ముందు డిమాండ్ చేసారు. కానీ వారి మాటలు ఆ షోని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. మొదట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేసిన సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ అయినా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అలా ఇప్పటికి 6 రెగ్యులర్, ఒక OTT వెర్షన్ సీజన్లను విజయవంతంగా చేసుకుంది BigBoss షో. కాకపోతే తాజాగా ముగిసిన 6వ సీజన్ కి మాత్రం అనుకున్నంత రేటింగ్ రాలేదని సమాచారం. దాంతో ఈసారి ఎలాగైనా మునుపటి ఎపిసోడ్స్ కంటే అదిరిపోయే రీతిలో ప్లాన్ చేసి రేటింగ్స్ పొందాలని BigBossషో నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కంటెంట్ ను తీసుకురావడానికి యత్నిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సీజన్లో కంటెస్టెంట్ లు అందరూ జంటలుగా రాబోతున్నారని సమాచారం.

అంటే కేవలం మొగుడు – పెళ్లాలనే BigBoss7లో మనం చూడబోతున్నాం. కాగా ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తంగా చూసుకుంటే 10 లేదా 11 జోడీలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని భోగట్టా. ఇక ఆ జంటలు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, తేజస్విని ఈసారి బిగ్ బాస్ జోడిలో ఒకరిగా రాబోతున్నారని సమాచారం. కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.