టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఫేక్..బీ అలెర్ట్!

చంద్రబాబు-పవన్ తాజాగా కలిసిన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ వారు పొత్తు పెట్టుకున్నా..తమకు వచ్చే నష్టం లేదని అంటూనే…బాబు-పవన్‌లపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ-జనసేనలపై వైసీపీ కుట్ర పన్నుతుందని, గత ఎన్నికల ముందు అలాగే సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్లతో టీడీపీ-జనసేనల మధ్య గొడవలు పెట్టిందని, ముఖ్యంగా కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు రాజేసిందని..అలా పూర్తిగా వైసీపీ ట్రాప్ చేసి సక్సెస్ అయిందని, కానీ ఇప్పుడు ట్రాప్ లో పడకూడదని ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాయి.

ఇప్పటికే బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయని ఈ నేపథ్యంలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి, దాన్ని రాజకీయంగా మార్చి లబ్ది పొందాలని వైసీపీ చూస్తుందని, కాబట్టి అందరూ అలెర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం స్పందించిన విషయం తెలిసిందే. సినిమాల విషయంలో చిచ్చు పెట్టి వైసీపీ పబ్బం గడుపుకుంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే సీట్ల పంపకాలు, కాపుల ఓట్లని పవన్..బాబుకు తాకట్టు పెడుతున్నారని లేనిపోనీ విమర్శలు చేస్తారని, వాటిని తిప్పికొట్టాలని టీడీపీ-జనసేన శ్రేణులు అలెర్ట్ చేస్తున్నాయి.

ఇదే సమయంలో అనుకున్న విధంగానే వైసీపీకి చెందిన వెంకటరెడ్డి…బాబుని పవన్ అడ్డుకుంటున్న సీట్లు ఇవే అంటూ ఓ 22 సీట్ల లిస్ట్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి టీడీపీ-జనసేన శ్రేణులు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నాయి. చంద్రబాబు-పవన్ వెంకటరెడ్డి చెవిలో చెప్పడంతో.. ఆ సీట్లని ప్రకటించారని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తుని వైసీపీ గట్టిగా టార్గెట్ చేసేలా ఉంది.