శ్రీ‌లీల‌కు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమ‌నిపించిన త్రివిక్ర‌మ్‌?!

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కెరీర్ ప‌రంగా యమా జోరు చూపిస్తోంది. `పెళ్లి సంద‌D` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుని యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన రెండో చిత్రం `ధమాకా` సైతం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా కడుపుతోంది.

శ్రీలీల ఇప్పుడు రామ్ కు జోడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. అలాగే నితిన్ తో `జూనియర్`, నవీన్ పోలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావు పూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `ఎన్‌బీకే 108` లో ఓ కీల‌క పాత్రకు ఎంపికయింది. వీటితో పాటు మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న`ఎస్ఎస్ఎమ్‌బీ 28` లోనూ ఈమెకు ఆఫర్ ద‌క్కిన‌ట్లు వార్తలు వచ్చాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా ఇటీవల త్రివిక్రమ్ శ్రీలీలను ఎంపిక చేశాడని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా శ్రీ‌లీల‌కు షాక్ తగిలిందట. మహేష్ సినిమాలో నుంచి త్రివిక్రమ్ ఆమెను తొల‌గించాడట. పాత్రకు ఆమె సెట్ కాకపోవడం వల్లే శ్రీ‌లీల‌ను సైడ్ చేశారని టాక్ న‌డుస్తోంది. మొత్తానికి మ‌హేష్ తో సినిమా అని ఊరించి ఊరించి చివ‌ర‌కు శ్రీ‌లీల‌కు త్రివిక్రమ్ ఉసూరుమ‌నిపించాడ‌ని అంటున్నారు.