టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలి నేని దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ రోజున వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈరోజు ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే బాలయ్య ఈ చిత్రంలో ఊర మాస్ లుక్కుల గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టానని బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మందు తరాలు నాకిచ్చిన బాధ్యత నాది ఫ్యాక్షన్ కాదు సీమ మీద ఎఫెక్షన్ అని చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అనంతపూర్ కర్నూల్ వంటి పేర్లను వాడుతూ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ విలన్స్ గా కనిపించబోతున్నారు. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించిన యాక్షన్ లో మాత్రం ఇద్దరు అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇక సంగీతం ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోరు కూడా వీరలెవల్లో ఉందని చెప్పవచ్చు.బాలయ్య ట్రైలర్ తోనే మంచి హిట్ అందుకున్నారని అభిమానులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది .