సంక్రాంతి సినిమాల పోరులో హాట్ టాపిక్ గా మారిన శృతిహాసన్ రెమ్యూనరేషన్..!!

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లకు జోడిగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక శృతిహాసన్ అయితే ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు ఈమె పైనే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ ముద్దుగుమ్మ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈమెకు సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం పెద్దగా కెరియర్ పైన ప్రభావం చూపలేదు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ తోనే ఎక్కువగా కొనసాగుతోంది సంక్రాంతికి ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Shruti Haasan to star opposite Chiranjeevi in Mega154: 'You bring woman  power…' | Entertainment News,The Indian Express

ఇక స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్న హీరోలలో చిరంజీవి నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. వీరిద్దరితో రెండు ప్రాజెక్టులు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో నటిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం. అయితే ఈ సినిమాలకు శృతిహాసన్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతొంది.

Shruti Haasan to pair opposite Nandamuri Balakrishna for his next with  Gopichand Malineni? | Telugu Movie News - Times of Indiaఇక అసలు విషయంలోకి వస్తే ఒక్కో సినిమాకి రూ 2 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుందట .ఈ ముద్దుగుమ్మ దీంతో ఈ రెండు చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ వారు రూ.5 కోట్ల రూపాయలు రెమ్యున రేషన్ ఇచ్చినట్లుగా సమాచారం. ఒక విధంగా ఈమెకు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఈ రెండిట్లో ఏ సినిమా సక్సెస్ అయినా సరే ఈమె రేంజ్ మారిపోతుంది. ఇక ప్రభాస్ తో ప్రస్తుతం సలార్ సినిమాలో కూడా నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో రెమ్యూనరేషన్ మరింత హై చేసే అవకాశం ఉందని సమాచారం.