పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ లో ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించింది. అక్కినేని హీరోల అందరితో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరిర్ బిగినింగ్ లో నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో కూడా పూజ ఓ కమర్షియల్ యాడ్ లో కలిసి నటిస్తుందట.
ఆ యాడ్ షూటింగ్ కూడా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ యాడ్ ను అర్జున్ మాలిక్ తెరకెక్కిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ యాడ్ విడుదల కానుంది. ఇప్పుడు వాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది శీతల పానియాల యాడ్. పూజ- నాగార్జునతో సినిమాలో కలిసి నటించకపోయిన ఇలా ఓ కమర్షియల్ యాడ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు దీంతో అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించేసింది ముద్దుగుమ్మ.
అక్కినేని హీరోలలో నాగార్జున గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అందులో బంగారు రాజు సినిమా మాత్రమే హిట్ సినిమాగా నిలిచింది. దసరా కానుకగా వచ్చిన ఘోస్ట్ సినిమా ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. నాగచైతన్య కూడా బంగార్రాజు సినిమాలో హీరోగా నటించాడు. మరో అక్కినేని హీరో అఖిల్ రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ముందుకు వచ్చింది లేదో. ఈ సంవత్సరం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
నాగార్జున ప్రస్తుతం తనయుడు అఖిలతో కలిసి ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో మల్టీ స్టార్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. పూజా హెగ్డే కూడా గత సంవత్సరం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరో సినిమా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఆచార్య, రాదే శ్యామ్, కోలీవుడ్లో బీస్ట్, బాలీవుడ్లో సర్కస్ సినిమాలలో నటించగా అవన్నీ ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే పూజ హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా తో అయినా ఈ అమ్మడు బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.