బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా యమ జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు గత ఏడాది నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాయి. బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో పూజా హెగ్డే కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆశలన్నీ మహేష్ బాబు పైనే పెట్టుకుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. దసరాకు ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత మహేష్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను మొత్తం మార్చేశాడు. ఇక స్క్రిప్ట్ ను మార్చడం వల్ల మళ్ళీ కొత్తగా షూటింగ్ ను స్టార్ట్ చేశారు.
అలాగే పూజా హెగ్డే తో పాటు శ్రీలీలను సైతం హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే కు శ్రీలీల రాకతో కొత్త తలనొప్పి మొదలైంది. ప్రస్తుతం పూజా హెగ్డే తో పోలిస్తే శ్రీలీలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీలీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సీన్లను రాసుకున్నారట. అంతేకాదు, పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని.. ఈ సినిమా ఒకవేళ మంచి విజయం సాధించిన ఎక్కువ క్రెడిట్ శ్రీలీలకే దక్కుతుందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. దీంతో పూజా హెగ్డే పనైపోయిందని.. ఇక ఆమె దుకాణం సద్దేయాల్సిందే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.