చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. నేషనల్ క్రష్ రష్మిక విషయంలో పలువురు నెటిజన్లు ఇదే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో `కిరిక్` పార్టీ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో రిషబ్ శెట్టి ద్శకుడిగా మారగా.. రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అలాగే రష్మిక ఈ మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే కొన్ని రోజుల క్రితం సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా కాంతార చూడలేదని చెప్పడం, ఆ తర్వాత తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి పేర్లు కాకుండా ఏదో ఓ నిర్మాణ సంస్థ అని చెప్పి రష్మిక పెద్ద వివాదానికి తెరలేపింది. దాంతో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య గత కొంత కాలం నుంచి కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. సొంత గడ్డపైనే రష్మికపై తీవ్ర స్థాయిలో వ్యతిరేఖత నెలకొంది. కన్నడీగులు రష్మికను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
అప్పటి నుంచి రష్మికపై ట్రోల్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేసింది. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనకు ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణం అని ఆమె చెప్పడం విశేషం. అయితే రష్మిక వ్యాఖ్యల పట్ల నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అభిప్రాయపడుతున్నారు.