టాలీవుడ్ , కోలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది హీరోయిన్ నయనతార. ఇక ఇటీవలే విడుదలైన కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాపై నయనతార సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటీవల ఒక వార్తకు సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఏడాది పూర్తిగా బాలీవుడ్ సినిమాలలోనే నటించబోతున్నట్లు తెలియజేసింది.
అంతేకాకుండా ప్రేక్షకులు ప్రస్తుతం కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రలని ఇష్టపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలనే చూస్తున్నారని తెలియజేస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరూ కూడా కథ బాగుంటేనే సినిమాలను ఆదరిస్తున్నారు అందుచేతనే తను నటించిన కనెక్ట్ సినిమాని అన్ని భాషలలో కూడా విడుదల చేశామని తెలియజేస్తోంది. అలాగే నయనతార తన 20 ఏళ్ల సినీ ప్రయాణం గురించి కూడా మాట్లాడడం జరిగింది.
నయనతార మాట్లాడుతూ తన సినీ ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని.. కానీ ప్రస్తుతం అయితే అంతా బాగుందని సినిమాల వల్ల సినీ ఇండస్ట్రీలో ఉండే వారి వల్ల కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారని తెలియజేసింది.ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు అని తెలియజేసింది. ఒకానొక సమయంలో తనని కూడా హేళన చేయడం ట్రోల్స్ చేయడం వంటివి కూడా చేశారని తెలియజేస్తోంది. అంతేకాకుండా తనమీద ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయని తెలుపుతోంది. కానీ వివాహమైన తర్వాత తనకి మరిన్ని బాధ్యతలు పెరిగాయని తెలియజేస్తోంది నయనతార.