అద్గది.. బాలయ్య డైరెక్టర్ అంటే అలానే ఉండాలి .. నందమూరి ఫ్యాన్స్ ఫిదా..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాము అన్నది కాదు ..జనాల మనసును దోచుకున్నామా ..వాళ్ళ నాడి పట్టి వాళ్లకు నచ్చే రేంజ్ లో సినిమాలను తెరకెక్కించామా. ప్రెసెంట్ ఇవే లెక్కలను సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఫాలో అవుతున్నారు . ఎస్ కేవలం సినిమా హీరో హీరోయిన్లే కాదు డైరెక్టర్లు కూడా ఆ రేంజ్ తగ్గ పబ్లిసిటీని పాపులారిటీని సంపాదించుకున్నారు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి స్టార్ హీరో కన్నా మించిపోయే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే .

ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే అభిమానుల వద్ద కొన్ని కొన్ని సార్లు తగ్గితేనే ఆ డైరెక్టర్ కి పేరు.. ఆ పేరు ద్వారా పాపులారిటీ వస్తుంది. కాగా అలాంటి పనే చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ ప్రశంసలను అందుకుంటున్నాడు బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని . మనకు తెలిసిందే టాలీవుడ్ నందమూరి నట సింహం బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి .ఈ సినిమాను డైరెక్టర్ చేసిన డైరెక్టర్ నే ఈ గోపీచంద్.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి టైం లోనే సోషల్ మీడియాలో గోపీచంద్ మల్లినేని పేరు మారు మోగిపోతుండడం సినిమాకు మరో హైప్ ఇచ్చింది. రీసెంట్ గా ఒంగోలులో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు పోలీసులు నందమూరి అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . కాగా రీసెంట్ గా మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దీని పై స్పందించాడు డైరెక్టర్.

“నందమూరి ఫ్యాన్స్ కి నేను క్షమాపణ చెప్తున్నాను . కొందరు అభిమానులపై లాఠీచార్జ్ జరిగిందట . నాకు ఆ విషయం ఆలస్యంగా తెలిసింది . వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను . అనుకున్న జనాభా కి మించి ఎక్కువ ఈవెంట్ కి వచ్చారు . అందుకే ఇలాంటి పొరపాటు జరిగింది . నన్ను క్షమించండి “అంటూ చెప్పుకొచ్చారు . అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఇలా అభిమానులకు సారీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు గోపీచంద్ మలినేని ఇలా నందమూరి ఫ్యాన్స్ కు సారీ చెప్పడంతో కుర్రుగా ఉన్న కొందరు నందమూరి ఫ్యాన్స్ కూల్ అయిపోయారు . సినిమాను బ్లాక్ బస్టర్ హీట్ చేస్తాం అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా వీరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ లెక్కలు తిరగరాసేస్తుంది అంటూ పలువురు నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!