పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆ వార్త‌ల‌న్నీ పుకార్లే అట‌!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుత‌న్న‌ సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్‌, రాధేశ్యామ్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్‌ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబోలో `ఎస్ఎస్ఎమ్‌బీ28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లింది. అయితే ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుందంటూ గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.

ఈ వార్తలతో అభిమానులు ఎంతగానో కలవర చెందారు. కానీ తాజాగా వారిని ఖుషి చేసే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే పూజా హెగ్డే మ‌హేష్ మూవీ నుంచి త‌ప్పుకుంది అన్న‌ వార్తలన్నీ పుకార్లే అట‌. అంతేకాదు ఆమె తాజాగా మహేష్ మూవీ షూటింగ్ లో సైతం జాయిన్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డేల‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీతో అయినా హిట్టు కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని పూజా ఆశపడుతోంది. మరి ఆమె ఆశ నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.