ఒకప్పటి అందాల తారగా పేరుపొందిన హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడ చక్కని అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్యరాయ్ తో అందంలో పోటీపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈమె అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటోంది మధుబాల. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన మధుబాల ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈమె ప్రేమ దేశం అనే సినిమాలో నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉంటోంది. మధుబాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ గురించి యాంకర్ పలు ప్రశ్నలు అడగక అందుకు మధుబాల మాట్లాడుతూ.. హీరోయిన్స్ విషయంలో తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది. ముఖ్యంగా ఆమె నేచురాలిటీ డాన్స్ పరంగా చాలా అద్భుతంగా చేస్తుందని తెలియజేస్తుంది.
అలాగే హీరోలలో పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అని కూడా తెలియజేసింది మధుబాల .అలాగే ఈ తరం యంగ్ హీరోలలో మాత్రం నాగచైతన్య అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మధుబాల చేసిన ఈ కామెంట్స్ కు అటు అక్కినేని అభిమానులు పవన్ అభిమానులు చాలా కృషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.