సాయి ధరంతేజ్ కం బ్యాక్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం విరూపాక్ష.ఈ చిత్రాన్ని కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ వాయిస్తూ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అందించడం విశేషం అని చెప్పవచ్చు.

Sai Dharam Tej's Old Clip Helping An Injured Person Wins The Internet -  Filmibeatప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ కావడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్ ,మలయాళం ,కన్నడ, హిందీ వంటి భాషలలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళ వెర్షన్ కు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. నిన్నటి రోజున ఈ చిత్రం టైటిల్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో గంభీరమైన వాయిస్ తో ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర బాటలోనే ఈ సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాని ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ సాయి ధరంతేజ్ నటిస్తున్న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో కీలకమైన పాత్రలు బ్రహ్మాజీ అజయ్ సునీల్ నటిస్తూ ఉన్నారు. సాయి ధరంతేజ్ కం బ్యాక్ ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి మరి.