టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇటీవల లండన్ టూర్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందేRRR సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా లండన్ వీధుల్ని రాత్రి సమయంలో చుట్టేస్తున్న ఎన్టీఆర్-ప్రణతి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..ఆ ఫోటోలను చూడముచ్చటగా కనిపిస్తున్నారు.చుట్టూ మాల్స్.. ప్రకాశవంతమైన లైటింగ్ మధ్య దంపతుల ఫోటో క్రేజీగా ఉంది. ఇందులో తారక్ ప్రణతి ఇద్దరూ షాపింగ్ చేసి ఇలా రోడ్డుపై నుంచొని ఫోటోకి ఫోజులిచ్చారు.
లండన్ లో చలి ఎక్కువగా ఉండటం వలన వింటర్ కోట్ లో కనిపిస్తున్నారు. ఈ దంపతులు వారిద్దరూ జీబ్రా క్రాసింగ్ వద్ద నుంచుని కెమెరాకి ఫోజులిచ్చారు. అయితే ఈ ఫోటోలో ఎక్కడ పిల్లలు కనిపించలేదు. పిల్లలిద్దరూ టూర్ కి రాలేదా? అన్నది క్లారిటీ లేదు. అభిమానులు తమదైన శైలిలో తారక్ జోడిని ఉద్దేశించి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.చెప్పాలంటే వీరిద్దరూ లొకేషన్స్ కి వెళ్ళటం చాలా తక్కువ..ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటారు. ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకుంటారు.
ఈసారి న్యూ ఇయర్ వేడుకలు మాత్రం లండన్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేయనున్నారు.
ఇక తారక్ 30 వసినిమా సంక్రాంతి తరువాత స్టార్ట్ అవుతోంది. అందుకే ఇలా లాంగ్ వెకేషన్ కు వెళ్లవలసి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ అన్ని రకాల పనులు పూర్తిచేసుకుని తారక్ కోసం వెయిట్ చేస్తున్నారు. తారక్ లండన్ నుంచి తిరిగి రాగానే శరవేగంతో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ ,ప్రణతి అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram