తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.
భోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తున్నది చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాక పోతున్నారు. తమిళంలో విడుదలైన వేదాలం సినిమాని రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన సన్నివేశాలను రి షూట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఇప్పటినుంచి అందరి నటీనటుల యొక్క డేట్స్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా 20 నుంచి 25 రోజులపాటు షూటింగ్ ఉండబోతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు సైతం మినిమం గ్యారంటీ ఉండాలని ఉద్దేశంతోనే ఈ చిత్రంలో పలు మార్పులు చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే వచ్చే సమ్మర్ వరకు ఆగాల్సిందే..