ఆ సినిమాతో బాలయ్యకు అదృష్టం పట్టుకుందా..?

నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా అంతే స్టామినా తో వరుస సినిమాలు చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ అందుకుంటున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ “రాజశం మీ ఇంటి పేరు.. జై బాలయ్య ” .. అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేయగా.. ఈ పాటలో బాలయ్య తెల్ల దుస్తులతో ట్రాక్టర్ నడుపుతూ చాలా రాయల్ గా కనిపించారు.

వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ కూడా విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించగా.. నవీన్ మురళి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లుక్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరసింహారెడ్డి టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగులు సినిమా పై మరింత బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమాతో ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవడమే ఆయన విజయానికి బీజం పడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అఖండ సినిమా అదృష్టం ఈయనకు పట్టుకుంది . అందుకే వీర సింహారెడ్డి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అంటూ ఇప్పటికే ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.