టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎక్కువగా బాలయ్య ఎన్నో విమర్శలు కూడా వినిపించేవి.. బాలయ్య చాలా కోపిష్టి వ్యక్తి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ బాలయ్య ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలయ్య అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ,సినీ ప్రముఖుల గురించి పలు విషయాలను తెలియజేస్తూ వారితో మాట్లాడే విధానాన్ని బట్టి అభిమానులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
ఇప్పటివరకు మొదటి సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి రెండవ సీజన్ ని మొదలుపెట్టారు. ఇందులో రాజకీయవేత్తలు, నిర్మాతలు ,దర్శకులు, నటీనటులను తీసుకురావడం జరుగుతోంది. తాజాగా నటుడు ప్రభాస్ ని గెస్ట్ గా తీసుకురావడం జరిగింది. అలాగే ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ కలిసి ఇందులో ఇచ్చారు. ఈ ఎపిసోడ్ ఈనెల 30వ తేదీన ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల అయింది. అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్న సమయంలోనే ఒక అదిరిపోయే ప్రోమో ఆహా ప్రేక్షకుల కోసం విడుదల చేశారు.
ఈ సెకండ్ ప్రోమో లో బాలయ్య ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతున్న కొన్ని సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తున్నాయి. అంతేకాకుండా గోపీచంద్, బాలయ్య కలిసి ప్రభాస్ పైన కొన్ని సరదా సన్నివేశాలు కూడా మాట్లాడడం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ ప్రసారం కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ పెళ్లి విషయాన్ని అడగగా ప్రభాస్ ఇప్పట్లో మనకి ఇంకా రాసి పెట్టలేదు అనే విషయాన్ని తెలిపారు. దీంతో బాలయ్య అమ్మకు చెప్పే సమాధానం నాకు చెప్పొద్దు అంటూ కామెంట్స్ చేశారు. మరి బాలయ్య ఈ విషయాన్ని రాబడతారో లేదో తెలియాలి అంటే 30వ తేదీ వరకు ఆగాల్సిందే.