ప్రస్తుతం బుల్లితెర హవా కొనసాగుతోంది. అవును, ఒకప్పుడు OTT అంటే కేవలం టీవీని చూసినట్టే చూసేవారు. అక్కడ చిన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు, పెద్ద వాళ్ళు నటించారని అపోహలు ఉండేవి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఫామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోతున్న సినిమా టికెట్ ధరలు, స్నాక్స్ ధరలు సామాన్యుడి మెడలు వంచేస్తున్నాయి.
అందుకే నేడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. దాంతో ఇప్పుడు ఓటిటి రేంజ్ మారిపోయింది. నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు కూడా ఇప్పుడు OTTలోకి వచ్చి హోస్ట్ గా ఇరగదీస్తున్నారు అంటే అర్ధం చేసుకోండి. ఇదే కోవలో చాలా మంది ఓటీటీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగులో చాలా మంది హీరో హీరోయిన్లు డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. ఇక్కడ మొదటగా సమంత గురించి మాట్లాడుకోవాలి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత రేంజ్ మారిపోయింది. దెబ్బకు హిందీ నుంచి కూడా ఇప్పుడు అవకాశాలు మొదలయ్యాయి.
ఆమె తరువాత తమన్నా భాటియా గురించి మాట్లాడుకోవాలి. గతేడాది డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టింది తమన్నా. అయితే ఆమె నటించిన సిరీస్కు అనుకున్న రెస్పాన్స్ రాలేదు కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతరువాత కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్తో మెరిసింది ఈ తార. ఇక శృతి హాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా వెబ్ సిరీస్లు చేస్తుంది. తరువాత నిత్యా మీనన్ గురించి చెప్పుకోవాలి. అభిషేక్ బచ్చన్, నిత్య ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసినదే. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో ప్రియమణి కూడా బాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. ఇంకా అనేకమంది ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.