ఫైనల్లీ..అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన గుడ్ న్యూస్ వచ్చేసింది..!!

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరు మరింత రేంజ్ లో వైరల్ గా మారింది . కొందరు ఆమెను అప్రిషియేట్ చేస్తుంటే ..మరికొందరు ఆమెను తిడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఏమి పట్టించుకోని సమంత తన పనులు తాను చేసుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది .

రీసెంట్ గానే యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత.. త్వరలోనే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సన్నాహాలు చేస్తుంది . అంతేకాదు విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాను సైతం సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంత ..దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ పాజిటివ్ వైబ్స్ ను ఇస్తున్నాయని ..ఆరోగ్యం మరింత కుదుటపడిందని ..ఈ క్రమంలోనే తను కమిట్ అయిన సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిందట . అందుకే శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఖుషి మూవీ సెకండ్ షెడ్యూల్ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది .

అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ రెండవ వారంలో సమంత హీరోయిన్గా నటిస్తున్న ఖుషి మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో ఇన్నాళ్లు సమంత ఆరోగ్యం పై దిగులు చెందిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . సమంత మళ్ళి ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు . కాగా ఇదే విషయాన్ని త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తుంది.