అనుప‌మ‌ను ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరో..అంత ప‌ని చేశాడా?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతో సాలిడ్ హిట్ ద‌క్కింది. అదే స‌మ‌యంలో యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దీంతో మేక‌ర్స్‌ ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్‌` టైటిల్ తో సీక్వల్‌ ప్రకటించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డీజే టిల్లులో నేహా శెట్టి పాత్రకు ఎండింగ్ పడిన విషయం తెలిసిందే.

దీంతో టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ తాజాగా అనుపమను ఈ సినిమా నుంచి తొల‌గించార‌ట‌.. అనుపమ, సిద్ధూ మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయట. ఆ విభేదాల కారణంగా తన సినిమాలో హీరోయిన్గా అనుప‌మ‌ను తొలగించాలని, లేదంటే తాను హీరోగా చేయనని దర్శకనిర్మాతలకు సిద్ధూ తెగేసి చెప్పాడట. దాంతో చేసేదేమీ లేక అనుపమను తొలగించి మరో హీరోయిన్ ను వెతికే ప‌నిలో పడ్డారట మేక‌ర్స్‌. మొత్తానికి సిద్ధూ తన సినిమా నుంచి అనుప‌మను తొలగించి అవమానించాడంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.