గత కొన్ని రోజులుగా విశాఖ వేదికగా రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని పరిపాలన రాజధాని డిమాండ్తో పోరాటం మొదలుపెట్టింది..ఈ క్రమంలోనే విశాఖ గర్జన కార్యక్రమం చేశారు. అయితే అదే సమయంలో సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో..వైసీపీ నుంచి ఉత్తరాంధ్రని కాపాడాలని చెప్పి అక్కడ టీడీపీ నేతలు సమావేశం పెట్టుకున్నారు.
అలాగే గర్జన ముగిశాక..అదే రోజు పవన్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఎయిర్పోర్టుకు వచ్చిన మంత్రులు రోజా, జోగి రమేష్లపై జనసేన శ్రేణులు దాడి చేశాయని కథనాలు వచ్చాయి. ఇక ఇక్కడ నుంచి రాజకీయం మరో స్థాయికి వెళ్లింది. విశాఖ వేదికగా వైసీపీ వర్సెస్ జనసేన యుద్ధం మొదలైంది. వైసీపీ అధికార బలంతో పవన్కు చెక్ పెట్టడమే టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్లింది. దాడులు చేశారని చెప్పి కొందరు నేతలు, కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు.
అటు పవన్ నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమానికి పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. అయితే జనవాణి కార్యక్రమం రద్దు చేసుకున్న పవన్..తమ నేతలు, కార్యకర్తలని వదిలేవరకు విశాఖ వదిలి వెళ్లనని నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. అక్కడే పోలీసులు పవన్ ఎవరిని కలవకుండా పోలీసులు భారీగా మోహరించారు. జనసేన శ్రేణులు భారీగా వచ్చిన..వారిని చెదరగొట్టి పంపించేశారు. ఇలా అన్నీ రకాలుగా పవన్ని నిలువరించడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగింది.
అయితే వైసీపీ..పవన్కు చెక్ పెట్టాలనే క్రమంలో..అనూహ్యంగా ఆయనకు బెనిఫిట్ చేశారని చెప్పొచ్చు. ఆయనకు రాజకీయంగా ప్లస్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. అలాగే చంద్రబాబుతో సహ ఇతర పార్టీల నేతలు పవన్కు మద్ధతు తెలిపారు. ఇక ప్రజల్లో కూడా పవన్పై సానుభూతి పెంచారు. ఓవరాల్గా పవన్కు వైసీపీ ప్లస్ చేసింది.