ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ మంచాన పడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడట. గత కొన్ని రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ కు పరీక్షలు చేస్తే డెంగ్యూ అని తేలిందట. ఆయనని వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. ఆయన ఇప్పుడు బ్యాడ్ రెస్ట్ తీసుకోవడంతో.. ఆయన నటించే సినిమాలు వాయిదా పడినట్టు తెలుస్తుంది.
సల్మాన్ కొన్ని భారీ సినిమాలో నటిస్తున్నాడు.. అలాగే హిందీ బిగ్ బాస్ 16వ సీజన్ షూటింగ్లో కూడా బిజీగా ఉన్నాడు. సల్మాన్ కు డెంగ్యూ జ్వరం రావడంతో బిగ్ బాస్ ను కరణ్ జోహార్ కు అప్ప చెప్పినట్టు తెలుస్తుంది. అలా సల్మాన్ పరిస్థితి ఉంటే. తమిళ్ స్టార్ హీరో జయం రవి కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఆయన సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా వచ్చిందని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిన్న సాయంత్రమే టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం నేను క్వారంటైన్ లో ఉన్నానంటూ.. రెండు మూడు రోజులగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.అందరూ మాస్క్ వేసుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ జయం రవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అలా ఇప్పుడు మన స్టార్ హీరోలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. సల్మాన్ ఖాన్ తాజాగా గాడ్ ఫాదర్ అంటూ చిరంజీవి పక్కన స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. ఇక జయం రవి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ లో హీరోగా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు మంచానా పడటంతో వారి అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.
Earlier this evening I tested positive for Covid-19. Following all protocols, I have immediately isolated myself. I sincerely request all those that have come in contact with me to get themselves tested if necessary. Mask up. Stay safe! God bless.
— Jayam Ravi (@actor_jayamravi) October 21, 2022