ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. అభిమానులకు బిగ్ పండుగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు.

కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జ‌యంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ బిరుదును అందజేయనున్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే ఆ బిరుదును అందుకున్న తొమ్మిదవ వ్యక్తిగా పునిత్ రాజ్ కుమార్ నిలవనున్నాడు.

RRR' actor JR NTR pays emotional tribute to late Puneeth Rajkummar, sings  'Gelaya Gelaya' - WATCH

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఎన్టీఆర్ కు టాలీవుడ్ లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా ఎన్టీఆర్‌కు పునీత్ రాజ్ కుమార్ మధ్య మంచి స్నేహ సంబంధం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నన్నారు. వీరితో పాటు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు మరియు కర్ణాటక సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నారు.