నిన్నటి రోజున ఇండియా,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై చాలా ఉత్కంఠంగా కొనసాగిందని చెప్పవచ్చు. చివరికి ఇండియా మాత్రం చాలా ఘనవిజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఇక విజయ అసాధ్యం అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా గ్రీస్లో నిలుచొని ఆటను చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా చివరిలో ఒక బంతికి ఒక పరువు కావాల్సి ఉండగా విన్నింగ్ షార్ట్ కొట్టడం జరిగింది.
అలా 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ కీలకంగా ఈ మ్యాచ్లో మారారని చెప్పవచ్చు. ఈ విషయంపై దేశమంతట మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీకి ప్రశంసలతో ముంచేస్తున్నారని చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ సైతం విరాట్ కోహ్లీ పైన ప్రశంసలు కురిపించారు.
అందులో ఒకరు రాజమౌళి కాగా ,మరొకరు నందమూరి ఎన్టీఆర్. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని పొగుడుతూ రాజమౌళి ఈ విధంగా ట్విట్ చేశారు. కింగ్ కోహ్లీ మీకు వందనాలు అంటూ రాజమౌళి ట్రీట్ చేశారు.అలాగే ఎన్టీఆర్ అద్భుతమైన రన్ కోహ్లీ తో పాటు టీం సభ్యులు తమ ప్రయత్నంతో మరుపురాని విజయాన్ని అందుకున్నారని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు కూడా జపాన్ లో RRR సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.
https://twitter.com/ssrajamouli/status/1584153030668472320?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1584153030668472320%7Ctwgr%5E7f6d09083cc888403d0f4f576ef46df728a7e375%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugustop.com%2Fvirat-kohli-leads-india-to-the-victory-over-pakistan-ntr-rajamouli-praises
https://twitter.com/tarak9999/status/1584160335438974976?s=20&t=vPhwNnB-vFoD7Er–Ldl5Q