టాలీవుడ్ లో మహేశ్ అంటే ఇష్టంలేని హీరో అతనొక్కడే..అమ్మ చనిపోయిన పలకరింపేలేదు..ఎంత దారుణం అంటే ..!!

ఒక మనిషి బాగుపడుతుంటే పక్కనుండే వాళ్ళు చూసి కుళ్లుకునే రోజులు ఇవి. మనిషి పడిపోతే చూసి ఆనందించే జనాభా ఇంకా మన మధ్యనే ఉన్నారు. పడిపోతే చేతులు ఇచ్చే మనుషులకన్నా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టి పైశాచిక ఆనందం పొందే జనాలు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు . మనం బతుకుతున్న ఈ సమాజంలో రోజు అలాంటి వాళ్ళను చూస్తూనే ఉన్నాం .అయితే సాటి మనిషి చనిపోతే చలనం లేకుండా బాధపడుతున్న వ్యక్తిని పలకరించే గుణం లేకుండా ఉండే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ఈ తెలుగు హీరో . వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే అంటున్నారు సినీ ప్రముఖులు.

మనకు తెలిసిందే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతటి పేరు సంపాదించుకున్నాడో. మరీ ముఖ్యంగా సినిమాల పరంగా కన్నా కూడా మహేష్ బాబు క్యారెక్టర్ పరంగా జనాలు ఎక్కువ ఇష్టపడతారు . ఎవరి జోలికి వెళ్లడు. గొడవల జోలికి అసలే వెళ్లడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తాడు . సినిమా ప్రమోషన్స్ లో బయట కనిపిస్తాడు. మిగతా టైంలో అస్సలు బయట కనిపించడు. తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కనిపిస్తే నవ్వడం ఎదురొస్తే పలకరించడం ఇదే మహేష్ బాబుకు తెలిసిన పద్ధతి . అయితే ఇలాంటి మహేష్ బాబుకు కూడా ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు.

ఎస్ రీసెంట్గా మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోఖసంద్రంలో మునిగిపోయింది. మహేష్ బాబు అయితే తల్లడిల్లిపోతున్నాడు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ ఇక లేదే అంటూ కృంగిపోతున్నారు. స్టార్స్ కూడా మహేష్ బాబును అలా చూసి తట్టుకోలేకపోతున్నారు. మేమున్నాం మహేష్ ఆ బాధ నుండి బయటకు రా అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతమంది మహేష్ బాబు అమ్మగారి గురించి గొప్పగా చెబుతూ మహేష్ బాబుకు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న హీరో మాత్రం మహేష్ అమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఆమెకు నివాళులు అర్పించలేదు. అదే కొన్ని రోజుల క్రితం మృతి చెందిన కృష్ణంరాజు విషయంలో మాత్రం ఈ హీరో అన్ని పనులు దగ్గర ఉండి చూసుకున్నారు. అక్కడికి వెళ్లి ప్రభాస్ ని దగ్గరుండి పలకరించడం.. అక్కడ బాధ్యతలను చూసుకోవడం ఆఖరికి కృష్ణంరాజు అంతిమ సంస్కారాల్లో కూడా ప్రధానంగా కనిపించారు. అయితే మహేష్ విషయంలో మాత్రం ఆ హీరో సైలెంట్ అయ్యారు. కనీసం పలకరించనేలేదు దీంతో సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి అతడికి మధ్య వార్ ఇంకా అలాగే ఉంది అంటూ చెప్తున్నారు జనాలు. గతంలో మంజుల విషయంలో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి ఆ హీరోకి కొన్ని గొడవలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అవి జరిగి చాలా కాలమే అయింది . ఇంకా ఆ గొడవలు మనసులో పెట్టుకొని ఆఖరికి అమ్మ చనిపోయిన పలకరించలేదు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.