తెలుగు చిలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం అయిన సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు మొదట నాటకాలు వేస్తూ.. మరొకవైపు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇకపోతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన నటనతో, ప్రతిభతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని , లక్షలాదిమంది ప్రజల మన్ననలు పొందారు. ఇక సినిమాలలో ఉన్నప్పుడు చారిత్రక, పౌరాణిక, జానపద , సాంఘిక వంటి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సీనియర్ ఎన్టీఆర్ .. భార్య సలహా మేరకు రాజకీయాల్లోకి వచ్చి చైతన్య రథయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి దగ్గరయ్యారు.
ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో కోటి రూపాయలు అందుకున్న మొదటి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఆయన తన మొదటి సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. 1949లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మన దేశం సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. స్వాతంత్రం రాక ముందు జరిగే కథాంశంతో ఈ సినిమాను తీశారు. స్వాతంత్రం రావడానికి ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు కానీ పూర్తి కావడానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా మన దేశం సినిమాను రూపొందించగా.. ఇందులో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్ర పోషించారు.
అప్పుడే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన సమయంలో.. నాగయ్య అప్పటికే పెద్ద హీరోగా కొనసాగుతున్నారు. ఇక అందరికంటే ఆయనకే ఎక్కువ పారితోషకం ఇచ్చేవారు.. ఎంత అంటే నెలకు రూ.40,000 పారితోషకం అందించేవారు. ఇకపోతే మన దేశం సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కు ఎన్టీఆర్ ను అనుకున్నారు. అందుకుగాను ఎన్టీఆర్ కి అడ్వాన్సుగా రూ. 250 ఇచ్చారట. ఇక ఈ సినిమాను నిర్మించిన కృష్ణవేణి స్వయంగా చెక్కు రాసి ఇచ్చారట. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటి చెక్ అందుకోగానే ఆయన కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసిందట. ఇక ఆ తర్వాత ఈ సినిమాకి గాను మొత్తంగా 2000 రూపాయల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.