బాలయ్య అభిమానులకు షాక్… వీరసింహారెడ్డి స్టోరీ లీకైపోయింది, పాత కథే అట!

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య సినిమా వచ్చిందంటే థియేటర్లదగ్గర సందడి మామ్మూలుగా ఉండదు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేస్తున్నారు. దీపావళి సందర్భంగా టైటిల్ లోగోని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే ఎంతో ప్రతిష్టత్మకంగా రాబోతున్న ఈ మూవీ స్టోరీ తాజాగా లీకైంది.

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సినిమా కావడం వలన బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతోనే పనిచేస్తున్నాడు. రిలీజైన టీజర్ మరియు ఫస్ట్ లుక్ చూస్తే పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న సినిమా అని అర్ధం అయిపోతోంది. కాగా ‘వీరసింహారెడ్డి’ మూవీలో నందమూరి బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నర్తించనుంది. ఇంకా ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.

అసలు విషయానికొస్తే, ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఇందులో బాలయ్య తండ్రి, కొడుకుగా డుయల్ రోల్ చేస్తున్నాడని టాక్. పల్నాడులో ఫ్యాక్షనిస్ట్ అయిన తండ్రిని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. దీంతో ఫారెన్‌లో ఉండే బ్యాంక్ ఉద్యోగి అయిన కొడుకు వచ్చి వాళ్లపై పగ తీర్చుకోవడమే ఈ సినిమా నేపథ్యం అని సమాచారం. ఇకపోతే ‘వీరసింహారెడ్డి’ చెల్లిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తుందట. పాత కథే అయినా.. ట్రీట్‌మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.