తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అసలు లక్ కలిసి రాలేదని చెప్పవచ్చు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ నభానటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో ఎన్నో సినిమాలలో నటించినా.. ఏ ఒక్కటి కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలో లేక ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ సినిమాలో వజ్రకాయతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో మెప్పించింది.
ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అదుగో సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలకే పూరి జగన్నాథ్ దృష్టిలో పడిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాస లో ప్రతి ఒక్కరిని అదరగొట్టింది నాభా నటేష్. అంతేకాకుండా అందులో గ్లామర్ షో తో తన అందాలతో ప్రేక్షకులను సైతం కట్టిపడేసేలా చేసింది. ఇక తర్వాత రవితేజ తో కలిసి డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ తో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలలో నటించింది.
ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ముద్దుగుమ్మ.. కెరియర్ రిస్క్ లో పడిందని చెప్పవచ్చు. ఇక చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇక తర్వాత నితిన్ తో కలిసి మాస్ట్రో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ పర్వాలేదు అనిపించుకుంది.
ఇక తమ ఫ్రెండ్స్ తో జాలీగా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ బీచ్ లో తన అందాలను ప్రదర్శించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా దీపావళిని అక్కడే ఎంజాయ్ చేసి గడిపినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
View this post on Instagram