“ఎందుకురా నేనంటే మీకు అంత పి****”..మరోసారి వాళ్లని కెలికిన అనసూయ..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మంచి పనులు కన్నా చెడు పనులు త్వరగా జనాలకు రీచ్ అవుతున్నాయి . ఆ మాటల్లో మాత్రం తప్పే లేదు . ఎస్ నిజమే ఓ మంచి పని చేశాను అంటూ వీడియో పెడితే రియాక్ట్ అయ్యే జనాలు కన్నా ఓ తప్పుడు మాట మాట్లాడితే రియాక్ట్ అయ్యే జనాల ఎక్కువగా ఉన్నారు . అంతలా సొసైటీలో నెగటివ్ ఫీలింగ్ వల్గర్ మాటలు వినాలంటే ఇష్టపడే జనాలు ఉన్నారంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనసూయ భరద్వాజ్.

లైగర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె చేసిన ట్వీట్ పరోక్షకంగా విజయ్ దేవరకొండను విమర్శించే విధంగా ఉంది అంటూ విజయ్ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. దీంతో మండిపోయిన అనసూయ వాళ్లకు ఘాటుగా ట్విట్స్ చేస్తూ కౌంటర్ ఇస్తూ ఏకంగా పోలీస్ కేస్ వరకు వెళ్లింది. ఇక తర్వాత సమస్య సర్దుమనిగిందిలే అనుకుంటే మరోసారి “మా ఆయన ఊర్లో లేడు: అంటూ బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది . దీనితో మళ్లీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది అనసూయ. ఇక రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆమె అభిమానులతో ముచ్చట్టించింది .

ఈ క్రమంలో ఓ నటిజెన్ “మిమ్మల్ని నేను ప్రతిసారి పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను.. కానీ ఆన్సర్ ఇవ్వట్లేదు” అంటూ డైరెక్ట్ గా అడిగారు. ఈ క్వశ్చన్ ని అనసూయ ఇగ్నోర్ చేస్తుంది అనుకున్నారు అంతా కానీ అనసూయ “ఆలోచిస్తున్నాను” అని అర్థం వచ్చేలా ఎమోజిని పెట్టింది. దీంతో అనసూయని మళ్ళీ ట్రోల్ చేశారు కొందరు. బూతు పదాలు వాడుతూ నీకు ఈ వయసు రెండో పెళ్లి అవసరమా..? అంటూ వల్గర్ కామెంట్స్ చేశారు. పాపం దీని ఎఫెక్ట్ అనుకుంటా..రీసెంట్గా సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా అనసూయ పోస్ట్ చేస్తూ..” ఎందుకురా నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ .నేను ఏమి మాట్లాడినా మీకు అంత ఇంపార్టెంట్ నా..ఏదన్నా అంత ఫీల్ అయిపోతారు. అయ్యో పిచ్చెక్యూటీస్.. అయ్యయ్యో ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్ అందరూ మళ్లీ ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతారా..? సరే మీకు నా కోసం అంత టైం ఉందంటే నేనేం చేయలేను మీ ఇష్టం” అంటూ వ్యంగ్యంగా ట్విట్ చేసింది. దీన్ని పరోక్షంగా అనసూయ రెండో పెళ్లి గురించి ట్రోల్ చేసేవారికి ఆమె ఇచ్చిన ఘాటు కముటర్ అంటూ అనసూయ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.