నయన్ కళ్ళు నెత్తికెక్కాయా..? బన్నీ కు ఘోర అవమానం..మండిపడుతున్న ఫ్యాన్స్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో నయనతార పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. కేవలం నాలుగు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది. ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇండియాలో సరోగసి బ్యాన్ అయిన కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్న నువ్వు ఇలాంటి ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యావు అంటూ తమిళనాడు ప్రభుత్వం మండిపడింది . దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలి అని చివాట్లు పెట్టింది.

దీంతో సోషల్ మీడియాలో నయనతారను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. కాగా ఈ టైం లోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం గతంలో నయనతార – అల్లు అర్జున్ ని అవమానించడమే. మనకు తెలిసిందే గతంలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో నయనతారకు బెస్ట్ హీరోయిన్గా అవార్డు వచ్చింది . దీంతో అల్లు అర్జున్ అవార్డు ఇవ్వవలసిందిగా స్టేజ్ పైకి పిలిచారు నిర్వాహకులు .అయితే అందరి ముందే నయనతార అల్లు అర్జున్ అవార్డు ఇస్తుండగా ..ఈ అవార్డు నాకు డైరెక్టర్ విగ్నేష్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అని అక్కడే చెప్పడం అభిమానులకు షాకింగ్ అనిపించింది. స్టార్ హీరో పొజిషన్లో ఉన్న అల్లు అర్జున్ అవార్డు ఇస్తూ ఉంటే ఎవరు వద్దన్నారు. కనీసం ఇద్దరూ కలిసి ఇవ్వండి అని కూడా నయన్ చెప్పలేదు . నాకు విగ్నేష్ తో అవార్డు తీసుకోవాలని ఉంది అంటూ చెప్పి అల్లు అర్జున్ ని అవమానించింది.

దీంతో స్టేజ్ పైనే అల్లు అర్జున్ ఫేస్ మారిపోయింది. కానీ పరిస్థితి అర్థం చేసుకున్న అల్లు అర్జున్.. అవార్డును విగ్నేష్ చేతిలో ఇచ్చి కేవలం దూరంగా ఉండిపోయాడు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నయనతారను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . కాగా ఇప్పుడు నయన్ సరోగసి ప్రాసెస్ నిజమైతే జైలు కెళ్ళి చిప్పకూడ తినడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు . ఈ సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నయనతారను ట్రోల్ చేస్తున్నారు. ఆ నాడు నువ్వు మా అన్నను అవమానించావ్ గా..? ఈనాడు నీకు దేవుడు తగిన శాస్తిని ఇచ్చాడు ..? అనుభవించు నీ కర్మ నువ్వే తెచ్చుకున్నావ్ ..? అందుకే ఎవర్ని అవమానించకూడదు. ఆ అవమానం తిరిగి నీకే దక్కింది..ఆ టైంలో నీ కళ్ళు నెత్తికెక్కాయి అందుకే ఆనాడు అలా బిహేవ్ చేసావ్.. ఇప్పుడు ఆ కళ్ళు దించేలా దేవుడు చూస్తున్నాడు..? అంటూ మండిపడుతున్నారు.