బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్త అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఎందుచేత అంటే బాలయ్య బాబుతో కలిసి వీరభద్ర సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలుగా నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే మీటు ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో నిరంతరం ఎప్పుడు వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. ఒక సినిమా షూటింగ్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేను సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆమెపై పలువురు దుండగులు సైతం హత్యాయత్న ప్రయత్న చేసినట్లుగా తెలియజేసింది. నేను ఉజ్జయిని లో ఉన్నప్పుడు తన కార్ బ్రేకులు ఎవరు రెండుసార్లు ట్యాంపరింగ్ చేశారని.. అందువల్ల ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి తృతిలో తప్పించుకున్నారని తెలియజేసింది. అయితే తన గాయాలు పూర్తిగా నయం కావడానికి చాలా సమయం పట్టింది అని తన గత అనుభవాలను సైతం గుర్తుకు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తనపై మరొకసారి ఎవరో విషప్రయోగానికి ప్రయత్నించారని తను శ్రీ దత్త తెలియజేస్తుంది.
ఇక తన ఇంట్లో ఒక మహిళ పనిమనిషిగా చేరిందని ఆమె వచ్చిన తర్వాతే తనకు ఎన్నో జబ్బులు వచ్చాయని తెలియజేసింది.. తను శ్రీ దత్త తాగే నీటిలో ఆమె ఏదో కలిపినట్లుగా అనిపించింది అని అది తనకు విషంలా అనిపించిందని తెలియజేసింది. ఇదంతా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల కారణంగానే జరిగింది అని తను శ్రీ దత్త పలు సంచలన కామెంట్లు చేస్తోంది. అంతేకాకుండా తనకి అవకాశాలు రాకుండా వచ్చిన అవకాశాలను భయపెట్టి అందులో నుంచి తొలగిస్తున్నారని తెలియజేస్తుంది. అయితే ఈమె కోర్టులో కేసు వేయగా ఈ విషయంపై కోర్టు క్లీన్ చీట్ కూడా ఇవ్వడం జరిగింది.