ఒకేసారి ప్రొఫైల్ ఫోటో మార్చిన అనుష్క – ప్రభాస్.. ఎక్కడో తేడా కొడుతోందే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ జంట కలిసి పలు సినిమాలలో నటించడం జరిగింది. అంతేకాదు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇక మీరిద్దరూ ఒకరినొకరు సినిమాలనైనా వదులుకుంటారు కానీ తమ మధ్య ఉన్న స్నేహాన్ని మాత్రం చెదరనివ్వరు అని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. Prabhas And Anushka Changed Their Dp At The Same Time Details, Prabhas , Anushka,bhahubali Movie,tollywood, Prabhas Anushka Relation, Prabhas Anushka Marriage, Prabhas Marriage, Social Media Dp-ఒకేసారి డీపీ మార్చిన ప్రభాస్, అనుష్క.. ఏదో తేడా కొడుతుందంటూ ఫ్యాన్స్ సంబరాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. ప్రభాస్ తో తనకున్న స్నేహం గురించి ప్రశ్నించినప్పుడు.. సినిమాలను వదులుకుంటా కానీ ప్రభాస్ తో స్నేహం మాత్రం వదులుకోనని అనుష్క తేల్చేసి చెప్పింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఎంతోమంది ఎదురు చేశారు. కానీ పెళ్లి అనే పదానికి మాత్రం దూరంగా ఉంటూ ఎవరికి వారు ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందరిలో ఇప్పటికే చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నారు అంటే వీరి మధ్య ఏదో నడుస్తోంది అని చాలామంది ఊహగానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరి మధ్యలో ఉన్న బంధం ఏంటో ఇప్పటికీ జనాలకు మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే వారి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమనా అని అనుమానాలు కూడా వస్తున్నాయి.Rumoured lovebirds Prabhas and Anushka Shetty jet off to Japan

అంతేకాదు చాలాసార్లు వీరి అభిమానులు వీరిద్దరిని కలిపి ఫ్యామిలీ ఫోటోగా కూడా ఎడిట్ చేసి వారికి తోడుగా ఇద్దరు పిల్లలు కూడా జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కానీ కేవలం అది చూసి మురిసే అంతవరకు మాత్రమే అన్నట్టు తెలుస్తుంది.జీవితంలో వీరిద్దరూ కలిసిపోవాలి అని, పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని ఎంతోమంది అనుకున్నా.. వీరు మాత్రం స్నేహం అనే పేరుతో తప్పించుకుంటున్నారు.అనుష్క, ప్రభాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.తమకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఇద్దరు ఒకేసారి తమ డీపీలు చేంజ్ చేయడంతో ఫాన్స్ లో అనుమానాలు వస్తున్నాయి. ఇద్దరు ఎప్పుడో పెట్టుకున్న ఒక డిపి ని ఇప్పటివరకు మార్చుకోకపోగా.. తాజాగా వీరిద్దరూ ఒకేసారి సోషల్ మీడియా ఖాతాలో డీపీ మార్చడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు ఇద్దరూ ఒకేసారి డీ పీ మార్చారు అంటే ఏదో తేడా కొడుతోంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.